telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎన్నికల కోడ్ తెలంగాణలో వర్తించదా: ఈసీ పై లోకేశ్ ఫైర్

Minister Lokesh comments YS Jagan

ఈసీ తీరుపై ఏపీ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. తెలంగాణలో లేని అభ్యంతరం ఏపీలో ఎందుకని ఈసీని ప్రశ్నించారు. ఒక్క టీడీపీకే ఆంక్షలు ఎందుకని నిలదీశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపే సమీక్షల్లో ప్రభుత్వ సీఎస్ తో పాటు డీజీపీ కూడా పాల్గొంటున్నారని లోకేశ్ తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ సమీక్షలపై సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికంగా పత్రికా ప్రకటనలు కూడా చేస్తోందని గుర్తుచేశారు.

ఏపీలో వర్తించిన ఎన్నికల కోడ్ తెలంగాణ వర్తించకపోవడం ఏంటని మండిపడ్డారు.ఎండాకాలంలో తాగునీటిపై సమీక్ష చేసి చర్యలు తీసుకునే అధికారం లేకపోతే ప్రజల పరిస్థితి ఏం కావాలని అడిగారు. ఈరోజు ట్విట్టర్ లో లోకేశ్ స్పందిస్తూ..‘ఎన్నికల కోడ్ ఒక్క ఏపీలోనే ఉందా? ఈసీ ఆంక్షలన్నీ ఒక్క టీడీపీకే వర్తిస్తాయా? అని ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts