ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు. ఉచిత విద్యుత్ వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఘాటుగా స్పందించారు. రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని స్పష్టం చేశారు.
రైతాంగం అంతా ఒక్కటై ఈ దగా మీటర్లు మాకొద్దని అంటున్నా, జగన్ బలవంతంగా మీటర్లు పెడుతున్నారని ఆరోపించారు.మోటర్లకు మీటర్లు పెట్టడానికి తాము అంగీకరించం అంటూ రైతులు ఓవైపు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు.
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం మర్తాడు గ్రామంలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు అధికారులు ప్రయత్నించడం దారుణం అని అన్నారు.. వైసీపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.