telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

పప్పు వ్యాఖ్యల పై స్పందించిన లోకేష్  

Nara lokesh comments on pappu
ఏపీ మంత్రి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్  పప్పు వ్యాఖ్యల పై ఘాటుగా స్పందించారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రజలకు తానేంటో తెలుసునని తాను చేసిన అభివృద్ధి ఏంటో కూడా అంతా గమనిస్తూనే ఉన్నారన్నారు. అలాంటప్పుడు పప్పు వ్యాఖ్యలపై తాను పట్టించుదలచుకోలేదని స్పష్టం చేశారు. 
మంత్రిగా తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 120 అవార్డులు తీసుకువచ్చానని తనపై చేస్తున్న వ్యాఖ్యలపై పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో  ఏదైనా ఒక పదం తప్పు దొర్లితే దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పెద్ద ఇష్యూ చేస్తున్నారంటూమండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని గమనిస్తే అందులో కూడా బోలెడు తప్పులు దొర్లుతాయన్నారు. వాటిని తాము పట్టించుకోవాలంటే ఎన్నో ఉంటాయని లోకేశ్ దుయ్యబట్టారు.

Related posts