ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగుతుంది. ఇప్పటివరకూ అందించిన సమాచారం ప్రకారం వైసీపీ 152 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా, టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది. రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో.. రెండు జిల్లాల్లో టీడీపీ ఇంత వరకూ ఖాతా తెరువలేదు. తాజాగా గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో నారా లోకేశ్ వెనుకంజలో ఉన్నట్లు తెలిసింది. మంగళగిరిలో నాలుగో రౌండ్ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి, టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ పై 7400 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. చిలకలూరి పేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై వైసీపీ అభ్యర్థి విడదల రజనీ 928 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
previous post
next post