నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా కొత్త చిత్రం గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఆదిత్య మ్యూజిక్ ఇంటియా ప్రై.లి పతాకంపై ఉమేశ్ గుప్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నెంబర్ వన్ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ నిర్మాణ రంగంలో తొలిసారి అడుగుపెట్టింది. శ్రీదేవీ మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. జాతీయ అవార్డ్ విన్నర్ సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత దిల్రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి సంగీత దర్శకుడు గోపీసుందర్ క్లాప్ కొట్టగా, జగదీశ్ గుప్తా కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఉమేశ్ గుప్తా గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ “జూలై 24 నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. హైదరాబాద్, రాజమండ్రి పరిసర ప్రాంతాలు, ఊటీ లో చిత్రీకరణ చేస్తాం. సతీశ్ వేగేశ్నగారు అద్భుతమైన ఎమోషన్స్తో సినిమా కథను సిద్ధం చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే చిత్రాన్ని నిర్మిస్తాం” అని తెలిపారు.
previous post