telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో అంశంపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు

Balakrishna

ఇటీవల ఇండస్ట్రీ పెద్దలు తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన చర్చల విషయంలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ విషయం ఇంకా ఇండస్ట్రీలో హాట్ హాట్‌గానే ఉంది. ఇప్పుడు మరో అంశంపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు ఇండస్ట్రీ ఇష్యూని, తెలంగాణ ప్రభుత్వ వైఖరిని బాలయ్య తన తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అసలు బాలయ్య ఏమన్నారంటే… ‘‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం బిల్డింగ్ కడతామని అన్నారు. అమెరికా వెళ్లారు. నన్ను పిలిచారా? చిరంజీవిగారు అంతా కలిసి అమెరికా వెళ్లారు. డల్లాస్‌లో ఫంక్షన్ చేశారు. ఐదు కోట్లు అన్నారు. వాటన్నిటిలో నేను ఇన్‌వాల్వ్ కాను. ఎందుకంటే ఆర్టిస్ట్ అనేవాడు ఫ్లవర్‌తో సమానం. ఎప్పుడూ ప్రకాశవంతంగా, బ్యూటీగా కనపడాలి. ఇవన్నీ ఎందుకు తలనొప్పులు. కాని పనికి ఎందుకు వెళ్లి కూర్చోవడం. ఇవాళ కట్టారా ‘మా’ కోసం బిల్డింగ్. ఈవాళ గవర్నమెంట్ ఎంతో సపోర్టింగ్‌గా ఉంది. మేమంతా ఇక్కడ ఉన్నాం కాబట్టి అంటున్నారు. మరి ఈవాళ అడిగితే రెండు మూడు ఎకరాలు ఫ్రీగా ఇవ్వరా? ఇండస్ట్రీ నుంచి ఎంత టాక్స్ కలెక్ట్ చేస్తున్నారు? కరోనాని పక్కన పెట్టి ఎందుకు సినిమా షూటింగ్స్ మొదలెట్టాలని ఆరాటం? కారణం టాక్స్‌లు.. డబ్బు. ఈ సొసైటీలో అత్యధికంగా టాక్స్ పే చేసేది మా ఇండస్ట్రీనే. ఇంత వరకు భవనం కట్టలేదు. ఒక్క బిల్డింగ్ కట్టడానికే.. మద్రాస్‌లో చూడండి. మేం డబ్బులు పెట్టి కట్టుకోలేమా? ఆ ఆలోచనలు రావు. అక్కడికి వెళ్లారు. ఏదో 5 కోట్లు అన్నారు. తర్వాత కోటి అన్నారు. మిగతా 4 కోట్లు ఏమయ్యాయి? ఏంటి ఇవన్నీ.. ఎవడు కూర్చుంటాడు. ఎందుకు.. ఏమన్నా లెక్కల మాస్టర్లా? అందుకే ఏం కలుగజేసుకోను. హిపోక్రసి, సైకోఫాన్సీలు ఎక్కువ. మైకులు చూడగానే పిచ్చెక్కుతుంది కొందరికి..’’ అంటూ మరోసారి బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా పెద్ద ఇష్యూని లేవనెత్తారు.

Related posts