telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

గోపీచంద్ తో బాలయ్య…

బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబోలో సినిమా అంటే కచ్ఛితంగా బాక్సాఫీస్ బద్దలవుతుందని అభిమానులకు నమ్మకం. వీరి కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్‌లుగా నిలిచాయి. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మే 28న ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాని నిర్మించనుంది. అయితే ఎప్పటినుండో హిట్ కోసం ఎదురుచుకున్న రవితేజకు గోపీచంద్ మలినేని ‘క్రాక్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. అయితే వీరి కాంబోలో ఇది హ్యాట్రిక్ సినిమా. అయితే ఆ మూడు సినిమాలలో రవితేజ మొత్తం మాస్ గానే కనిపించాడు. దాంతో బాలకృష్ణ-గోపీచంద్ కాబినేషన్ అనగానే అభిమానులలో అంచనాలు పెరిగిపోయాయి. చూడాలి మరి ఈ సినిమా విడుదలై ఆ అంచనాలను అందుకుంటుందా.. లేదా అనేది.

Related posts