telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

థియేటర్ లో రానున్న బాలయ్య ‘నర్తనశాల’…

బాలకృష్ణ నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకోవాలని ప్రయత్నించారు. ఆయన తండ్రి నటశిఖరం ఎన్టీఆర్ నటించిన ‘నర్తనశాల’ సినిమాను బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాలని చూసారు. ఈ సినిమాలో అర్జునిడిగా బాలయ్య నటించగా, భీముడిగా శ్రీహరి , ధర్మరాజుగా శరత్ కుమార్ నటించారు. ఇక ద్రౌపతిగా అందాలనటి సౌందర్య నటించింది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య కన్నుమూశారు. ద్రౌపతి పాత్రలో సౌందర్యను తప్ప మరో హీరోయిన్ ను ఉహించుకోలేమని  బాలయ్య ఏకంగా ఆ సినిమాను పక్కన పెట్టేసారు.

 హీరోయిన్ అకాల మరణం కారణంగా తన కలను కూడా పక్కన పెట్టేసాడు బాలకృష్ణ. అయితే ఈసినిమా 17 నిముషాలు చిత్రీకరించారు. అభిమానుల కోరిక మేరకు 17 నిమిషాల నిడివి ఉన్న ఆ సన్నివేశాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు బాలయ్య . విజయదశమి కానుకగా ఎన్బీకే థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేయనున్నారు.  ఎన్నాళ్ళనుండో నర్తనశాల సన్నివేశాలు చూడలనుకుంటున్న మీ కోరిక ఈ నెల 24న నెరవేరబోతోంది. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగాన్ని చారిటీస్ కు ఉపయోగించడానికి నిర్ణయించుకున్నాను అని బాలకృష్ణ తెలిపాడు.

Related posts