telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సైరా”పై నందమూరి హీరోల మౌనం… అందుకేనా ?

syeraa

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి తొలి చారిత్రక చిత్రం “సైరా నరసింహారెడ్డి” వెండితెరపై ప్రేక్షకులను మెప్పిస్తోంది. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5 భారతీయ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమితాబ్‌, కిచ్చా సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో రూపొందించారు. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “సైరా” చిత్రాన్ని దేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్లూ ఆదరిస్తూ సినిమాను విజయవంతం చేశారు. 7 రోజుల్లో 83 కోట్ల షేర్ అందుకుంది సైరా. ఓ తెలుగు సినిమాకు ఈ స్థాయి గౌరవం రావడం నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నానని చెప్పాడు చిరంజీవి. ఈ వయసులో చిరు చేసిన ఈ పాత్రను చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. తెలుగులో వసూళ్ల వర్షం కూడా కురుస్తుంది. హిందీలో ‘వార్’ సినిమా ఉంది కాబట్టి అక్కడ ఫ్లాప్ అయింది. ఇక ఈ చిత్రాన్ని తమ సినిమాగా భావించి తెలుగు ఇండస్ట్రీ కూడా బాగానే సపోర్ట్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఈ చిత్రం గురించి నందమూరి కుటుంబం మాత్రం ఒక్కరు కూడా మాట్లాడలేదు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య ఎలాంటి కామెంట్స్ చేయలేదు. పైగా ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా ఎన్టీఆర్ సైరాపై కమెంట్ చేయకపోవడం నిజంగానే గమనార్హం. ఇక బాలయ్య కూడా తనకు ఇండస్ట్రీలో ఉన్న ఏకైక మిత్రుడు చిరంజీవి అని చెప్పాడు. కానీ ఆయన సినిమా ఇప్పటి వరకు చూడకపోవడం నిజంగానే విడ్డూరం. అసలు నందమూరి హీరోలు చిరంజీవి సినిమాను చూసారా లేదా ? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ చూసినా కూడా స్పందించడం లేదా..? లేదంటే చూడలేదా అనేది తెలియాల్సి ఉంది.

Related posts