telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

మావోల వద్ద పాక్ ఆయుధాలు..షాక్ కు గురైన అధికారులు

naksals encounter

ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందిన  సంగతి తెలిసిందే. వారి వద్ద నుంచి కొన్ని ఆయుధాలను కూడా భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ ఆయుధాలను పరిశీలించిన అధికారులు షాక్ కు గురయ్యారు. ఎందుకంటే అవి పాకిస్థాన్ ఆర్మీ, నాటో దళాలు ఉపయోగించే కోచ్ జీ3, హెక్లెర్ రైఫిల్స్. ఈ నేపథ్యంలో, భద్రతాదళాల అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఆయుధాలు మావోలకు ఎలా చేరాయి? పాక్ ఆర్మీతో మావోలకు ఉన్న సంబంధాలు ఏమిటనే కోణంలో దర్యాప్తును ప్రారంభించారు.

పాక్ ఆర్మీ ఉపయోగించే ఆయుధాలను మావోల నుంచి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇతర దేశాలకు చెందిన వారు ఉపయోగించే ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం ఇది రెండోసారని తెలిపారు. గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్లో మృతి చెందిన మావోల నుంచి జర్మనీలో తయారైన రైఫిల్ ను, అమెరికాలో తయారైన సబ్ మెషిన్ గన్ ను స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు.

Related posts