తెలంగాణ లో ఓ టీఆర్ఎస్ నేతను నక్సలైట్లు మూడు రోజుల కిందట కిడ్నాప్ చేశారు. ఇప్పటి వరకు అతని జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. భద్రాద్రి జిల్లా చర్ల మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు నల్లూరి శ్రీనివాస్ ను మావోలు కిడ్నాప్ చేసి మూడురోజులవుతున్నా అతని ఆచూకీ లభించలేదు. గత మూడు రోజుల క్రితం మావోయిస్టు నక్సలైట్లు అర్ధరాత్రి ఆయన ఇంటికి వచ్చి మాట్లడేది ఉంది రమ్మంటూ… వెంట తీసుకెళ్లారు. ఇక అప్పటినుంచి ఆయన జాడ లేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు బిక్కు బిక్కుమంటూ రాత్రింభవళ్ళు ఆందోళన చెందుతున్నారు.
previous post