ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. జిల్లాలోని తిమురుపల్లి పంచాయతీ కార్యాలయాన్ని బాంబులతో పేల్చివేశారు. ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడలో కేంద్ర సాయుధ బలగాల దమనకాండకు నిరసనగానే ఈ భవనాన్ని పేల్చివేసినట్లు మావోయిస్టులు ప్రకటించారు. ఈ మేరకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్టు) పేరుతో కరపత్రాలను అంటించారు.
పంచాయతీ కార్యాలయాన్ని పేల్చివేసిన అనంతరం మావోయిస్టుల అటవీప్రాంతంలోకి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, కేంద్ర బలగాలతో కలిసి అటవీ ప్రాంతంలో కూంబింగ్ ను ముమ్మరం చేశారు. దీంతో ఏ క్షణాన ఏమి జరుగుతుందోనని పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తిమురుపల్లి గ్రామ ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
సీఎం పదవి కోసం జగన్ రూ.1500 కోట్ల ఆఫర్: మాజీ సీఎం ఫరూక్