telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ

ఒడిశాలో మావోయిస్టుల బీభత్సం.. పంచాయతీ ఆఫీసు పేల్చివేత

Maoists

ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లాలో  మావోయిస్టులు రెచ్చిపోయారు. జిల్లాలోని తిమురుపల్లి పంచాయతీ కార్యాలయాన్ని బాంబులతో పేల్చివేశారు. ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడలో కేంద్ర సాయుధ బలగాల దమనకాండకు నిరసనగానే ఈ భవనాన్ని పేల్చివేసినట్లు మావోయిస్టులు ప్రకటించారు. ఈ మేరకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్టు) పేరుతో కరపత్రాలను అంటించారు. 

పంచాయతీ కార్యాలయాన్ని పేల్చివేసిన అనంతరం మావోయిస్టుల అటవీప్రాంతంలోకి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, కేంద్ర బలగాలతో కలిసి అటవీ ప్రాంతంలో కూంబింగ్ ను ముమ్మరం చేశారు. దీంతో ఏ క్షణాన ఏమి జరుగుతుందోనని పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తిమురుపల్లి గ్రామ ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

Related posts