ఏపీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబుపై గుంటూరు అరండల్ పేట పోలీసులు కేసును రిజిస్టర్ చేశారు. ఓ స్థలాన్ని ఖాళీ చేయించే విషయమై, తన అనుచరులతో కలిసి దాడి చేశారన్న ఆరోపణలపై ఆనందబాబుతో సహా పలువురిపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే విద్యానగర్ నివాసి అయిన అద్దంకి శ్రీకృష్ణ అమరావతి రోడ్డు ప్రాంతాల్లో టెంట్ హౌస్, లైటింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
తన వ్యాపార విస్తరణ నిమిత్తం కర్లపూడి బాబూప్రకాష్ అధీనంలో ఉన్న నాలుగున్నర ఎకరాల స్థలాన్ని 2008లో 2021 వరకూ లీజుకు తీసుకుని షెడ్లను నిర్మించుకున్నారు. నిన్న శ్రీకృష్ణ కుమారుడు శివసాయి, మరో పది మంది వర్కర్లు షెడ్ల వద్ద పనుల్లో ఉండగా, నిందితులు సహా అక్కడికి వచ్చిన కొందరు షెడ్లను ధ్వంసం చేసి, రూ. 40 లక్షల విలువ చేసే సామగ్రిని ఎత్తుకెళ్లారు. దీనిపై శ్రీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసునమోదు చేసి విచారణ చేపట్టారు.
ఏపీలో విద్యుత్ కోతలు.. ప్రభుత్వంపై పవన్ చురకలు!