నాగార్జున, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా `శివమణి`. దాదాపు పదిహేనేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం ఘనవిజయంగా నిలిచింది. పోలీస్ అధికారిగా కనిపించిన నాగార్జున స్టైల్, పూరీ జగన్నాథ్ రాసిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా కరోనా నేపథ్యంలో ఆ సినిమాలోని ఓ సీన్ను నాగార్జున తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితికి తగినట్టుగా ఆ సీన్లోని డైలాగ్స్ను మార్చి భవిరి రవి మిమిక్రీతో రూపొందించిన ఆ వీడియోను నాగ్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. “శివమణి` సినిమా ఇప్పుడు వచ్చుంటే.. పూరీ జగన్నాథ్ డైలాగ్స్ కొంచెం ఇలాగే ఉండేవేమోన`ని నాగార్జున ట్వీట్ చేశారు. శివమణి సినిమాలో పూర్ణా మార్కెట్లో నాగార్జున చెప్పిన డైలాగులు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుకొస్తుంటాయి. పోలీసు పాత్రలో నటించిన నాగార్జున ఆ మార్కెట్లో రౌడీలపై పంచ్ డైలాగులు విసురుతాడు. ఆ డైలాగులనే మార్చి కరోనా వైరస్ జాగ్రత్తలను నాగార్జున వాయిస్లో రవి చెప్పాడు. ‘నా పేరు శివమణి.. నాకు కొంచం మెంటల్.. ఇప్పటివరకు మాస్కులు లేకుండా ఎందుకు తిరిగారో నేను అడగ.. సడన్గా కరోనా వచ్చింది మాస్కులు వేసుకోండి అంటే కష్టంగానే ఉంటది’ అంటూ నాగార్జున ప్రజలకు వార్నింగ్ ఇస్తున్నట్లు ఉన్న ఈ వీడియో వైరల్ అవుతోంది.
If I did the movie Shivamani now,@purijagan s dialogues would be somewhat like this in #CoronavirusCrisis pic.twitter.com/KrFiii8Ug2
— Nagarjuna Akkineni (@iamnagarjuna) April 25, 2020