రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం “మన్మథుడు-2”. ఈ చిత్రంలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్లు సినిమాపై హైప్ పెంచేశాయి. ఈ సినిమాలో హీరోయిన్లు సమంత, కీర్తి సురేష్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. లక్ష్మి, రావు రమేష్, వెన్నెల కిషోర్, ఝాన్సీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ ట్రైలర్లో కూడా లిప్లాక్ సన్నివేశాలను చూపించారు. ఈ సినిమాకు తాజాగా సెన్సార్ కంప్లీటైంది. సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసారు. నటుడు వెన్నెల కిషోర్పై హీరో నాగార్జున ప్రశంసలు కురిపించారు. నాగార్జున నటిస్తున్న “మన్మథుడు-2″లో వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సందర్భంగా హీరో నాగార్జున.. వెన్నెల కిషోర్పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “వెన్నెల కిషోర్ వెరీ టాలెంటెడ్. ‘మన్మథుడు-2’ సినిమాకు ఆయన వెన్నెల లాంటి వాడు. సినిమా షూటింగ్ అయ్యేంత వరకు మమ్మల్ని నవ్విస్తూనే ఉన్నాడు. ‘మన్మథుడు’ సినిమా చేసే సమయంలో ఎంత నవ్వుకున్నామో.. ‘మన్మథుడు-2’ సమయంలో కూడా అలాగే నవ్వుకున్నాం. సెట్లో ఆయన ఉంటే సందడే సందడి. వెన్నెల కిషోర్ నాకు సోదరుడి లాంటివాడు. రోజూ ఇద్దరం కలిసి భోజనం చేసేవాళ్లం. సాయంత్రం అయితే తప్పకుండా కలుసుకునేవాళ్లం. సినిమా షూటింగ్ అయిపోయింది. వెన్నెల కిషోర్ను చాలా మిస్ అవుతున్నా” అని అన్నారు.
previous post
ఆ పెద్దరికం గురువు దాసరితోనే పోయింది: మోహన్ బాబు