రెండు రోజుల క్రితం ఐటీ అధికారులు టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లు, ఆఫీసులపై ఆకస్మిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. ముందుగా ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుకి చెందిన ఆఫీసులతో పాటు రామానాయుడు స్టూడియోలో సోదాలు నిర్వహించారు. వెంకటేష్కి చెందిన ఆదాయపు లెక్కలని కూడా తనిఖీ చేసినట్టు సమాచారం. ఇక నాని ఇల్లు, ఆఫీసులలోను అధికారులు సోదాలు జరిపారు. అలానే హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ వంటి నిర్మాణ సంస్థలలోను కూడా ఐటీ అధికారులు సోదాలు జరిపారు. అయితే కొందరు నాగార్జు ఇల్లు, ఆఫీసులలోను సోదాలు జరిపినట్టు ప్రచారం చేశారు. ఈ క్రమంలో నాగ్ తన ట్విట్టర్ ద్వారా అసలు విషయాన్ని తెలియజేశాడు. “నా స్నేహితులు కొందరు మీ ఆస్తులపై ఐటీ శాఖ అధికారలు సోదాలు జరిపారట కదా అని ఫోన్స్ చేసి మరీ అడుగుతున్నారు. నా పై కాని, నా కార్యాలయాలపై కాని ఆదాయ పన్నను శాఖ అధికారులు ఎలాంటి సోదాలు నిర్వహించలేదు” అని నాగ్ ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చారు. బాలీవుడ్ చిత్రం “బ్రహ్మాస్త్రా” అనే చిత్రం చేస్తున్న నాగ్ ఇందులో ఆర్కియాలజిస్టుగా కనిపించనున్నారు. ఇక డిసెంబర్ లో ఓ తెలుగు ప్రాజెక్ట్ మొదలు పెట్టనున్నారు.
previous post
సీత” కోసం నాన్న మాట కాదన్నా : బెల్లంకొండ శ్రీనివాస్