telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా ఫై నాగబాబు సరికొత్త కామెంట్…

Nagababu

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ గురించి సినీనటుడు నాగబాబు సరికొత్త వ్యాఖ్యలు చేశారు. ‘ఈ భూమి మీద మనిషి అనే జీవి పూర్తిగా చస్తే ఈ భూమి, ప్రకృతి, వాతావరణం అద్భుతంగా ఉంటాయి. మిగిలిన జీవరాసులు చాలా చాలా సంతోషంగా జీవిస్తాయి’ అని అన్నారు. ‘సర్వ జీవరాసులు ప్రకృతి ధర్మాలకు లోబడి బతుకుతున్నాయి కరోనా వైరస్ సహా… ఒక్క మనిషి తప్ప’ అని నాగబాబు ట్వీట్లు చేశారు. కాగా, ఆయన చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ‘ఆ మనుషుల్లో మీరు కూడా ఉన్నారు కదా?’ అంటూ రిప్లై ఇస్తున్నారు.

Related posts