పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ఈరోజు జనసేన పార్టీలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం లోక్ సభ స్థానం నుంచి నాగబాబు పోటీచేస్తారని పార్టీ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ తనకు సోదరుడే కావొచ్చు… కానీ పార్టీలో చేరిన తనకు పవన్ ఓ నాయకుడని వ్యాఖ్యానించారు. ఆపీస్లో ఏ పని చెప్పినా చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని నాగబాబు వివరించారు.
ప్రజారాజ్యం ఏర్పాటు చేసిన సమయంలో ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక ఉండేదన్నారు. కొన్ని అనివార్య కారణాలతో అప్పట్లో పోటీ సాధ్యం కాలేదన్నారు.పవన్ ను చిన్నప్పటి నుండి అతి దగ్గరగా చూసిన వ్యక్తిని తాను అంటూ నాగబాబు అన్నదమ్ముల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చిన్నతనంలో పవన్ చాలా అందంగా ఉండేవాడన్నారు. ఒంటరిగా కూర్చొని ఆలోచించేవాడన్నారు. తాము ఏది అడిగినా మౌనం వహించేదని చెప్పారు. సమాజం కోసం చిన్నతనం నుండే పవన్ ఆలోచించేవాడని ఆ తర్వాత తాను అర్ధం చేసుకొన్నానని నాగబాబు పేర్కొన్నారు.
నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు..