telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మేం రాజకీయాలను చచ్చినా వదిలిపెట్టం: నాగబాబు

nagababu1

సమాజంలో బాధ్యతాయుతమైన రాజకీయం చేయాలని కల్యాణ్ బాబు, మేము రాజకీయాల్లోకి వచ్చామని నరసాపురం జనసేన అభ్యర్థి నాగబాబు తెలిపారు. మేం రాజకీయాలను చచ్చినా వదిలిపెట్టమని ని స్పష్టం చేశారు. తాము కుల రాజకీయాలను చేయబోమని నాగబాబు స్పష్టం చేశారు.హైదరాబాద్ లో ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సాధించబోయే ఫలితాలపై తమకు చాలా పెద్ద ఆశలు ఉన్నాయన్నారు.

ప్రజలు తమ తీర్పును ఇచ్చేశారనీ, దానిపై మాట్లాడటం అనవసరమని అన్నారు. తాము కుల రాజకీయాలను చేయబోమని నాగబాబు స్పష్టం చేశారు.మాది 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం కాబట్టి అధికారంలోకి వస్తే ఏం చేస్తాం? రాకుంటే కింగ్ మేకర్ అవుతామా? అన్న ఆలోచనే మాకు లేదన్నారు. రాజకీయాల్లో నేతలకు ఇన్ని సీట్లు గెలుస్తామని అంచనాలు ఉంటాయన్న ప్రశ్నకు నాగబాబు స్పందిస్తూ మేం గెలుస్తామని నమ్మకం ఉందన్నారు. 90 సీట్లు మాకు రావచ్చని ధీమా వ్యక్తం చేశారు.

Related posts