లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంటికే పరిమితమైపోవడంతో బుల్లితెరపై వచ్చే పలు షోలు, వార్తలు, సినిమాలు భారీ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. నాగశౌర్య, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ “అశ్వథ్థామ”. ఓ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర కథను స్వయంగా నాగ శౌర్య సమకూర్చగా, ఉషా మల్పూరి నిర్మించారు. శ్రీచరణ్ పాకల సంగీతం అందించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపకపోయిన బుల్లితెరపై మాత్రం సంచలనం సృష్టించింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన “అశ్వథ్థామ” చిత్ర శాటిలైట్ రైట్స్ జెమినీ దక్కించుకుంది. గతవారం బుల్లి తెరపై ఈ చిత్రాన్ని ప్రసారం చేయగా భారీ టిఆర్పి దక్కిచుకుంది. తాజాగా విడుదల చేసిన రిపోర్ట్స్ ప్రకారం “అశ్వథ్థామ” మూవీ 9.10 టిఆర్పి దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది నాగశౌర్య గత చిత్రాల అన్నింటికీ మించినది కావడం గమనార్హం. “అశ్వథ్థామ” మూవీ ప్రస్తుతం సన్ నెక్స్ట్ లో అందుబాటులో ఉంది.
previous post