‘వెంకీ మామ’తో సూపర్ హిట్స్ సాధించిన నటుడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్స్టోరి’ సినిమా చేస్తున్నాడు. అయితే నాగ చైతన్య, ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందని ఫిలింనగర్ టాక్. చైతు ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ఓ డిఫరెంట్ స్టోరి రెడీ చేసి వినిపించగా చైతు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ‘మనం’ తర్వాత వీళ్ల కాంబోలో రానున్న రెండో సినిమా ఇది. ఈ మూవీ కోసం ‘థ్యాంక్యూ’ అనే టైటిల్ ఫిలించాంబర్లో రిజిస్టర్ చేయించారని సమాచారం. కాగా ఈ సినిమా ఒక హర్రర్ థ్రిల్లర్ లా ఉండబోతుందని, అలాగే చైతుతో చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాలో రొమాన్స్ మరియు కామెడీ కూడా ఫుల్ గా ఉంటుందట. లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇప్పటికే షూట్ కు అవసరమైన సెట్స్ ను కూడా మేకర్స్ నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
previous post