యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఇటీవల “మజిలీ” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. “రారండోయ్ వేడుక చూద్దాం” తరువాత రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ అవి నాగ చైతన్యను బాగా నిరాశపరిచాయి. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్తో కలిసి “వెంకీ మామ” సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫిషియల్ ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా గురించి తాజాగా నాగచైతన్య ట్వీట్ చేశాడు. “నా కెరీర్ ప్రారంభం నుంచి ఒక దర్శకుడితో కలిసి పనిచేయాలని బలంగా కోరుకున్నాను.. ఆయనే శేఖర్ కమ్ముల. ఎట్టకేలకు అది జరుగబోతోంది. మరో మంచి ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. సెప్టెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతోంది. అన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయి. నాకు సపోర్ట్గా నిలుస్తున్న అందరికీ ధన్యవాదాలు” అని నాగచైతన్య ట్వీట్ చేశాడు.
next post