ఇటీవల “మజిలీ” సినిమాతో విజయాన్ని అందుకున్న అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సీనియర్ హీరో వెంకటేష్తో కలిసి నటించిన “వెంకీమామ” విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న సినిమాలో సాయిపల్లవితో కలిసి నటిస్తున్నాడు. `ఫిదా` వంటి బ్లాక్బస్టర్ విజయం తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల త్వరలో మరో స్వచ్ఛమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, ట్యాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి కాంబినేషన్లో మరో ప్రేమకథను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కూడా తెలంగాణ బ్యాక్డ్రాప్లోనే తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల ఈ సినిమాకు “లవ్స్టోరీ” అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో సాయిపల్లవి నృత్యకారిణిగా కనిపించబోతోంది. కెరీర్లో పైకి ఎదగాలనుకునే వ్యక్తిగా నాగచైతన్య కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య పూర్తిగా తెలంగాణ యాసలోనే డైలాగ్లు చెప్పబోతున్నాడట. అందుకోసం చైతూ ప్రస్తుతం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
previous post