telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

జనసేనలోకి నాగబాబు..నరసాపురం ఎంపీ గా పోటీ!

nagababu from kakinada as mp candidate
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో చేరికలు ఊపందుకొన్నాయి. ఇప్పటికే పలువురు  సినీ నటులు పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా  పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ఈరోజు జనసేనలో చేరుతున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం లోక్ సభ స్థానం నుంచి నాగబాబు పోటీచేస్తారని వెల్లడించింది. ఈ మేరకు జనసేన పార్టీ ట్విట్టర్ లో ఓ ప్రకటన చేసింది. గత కొంతకాలంగా రాజకీయంగా యాక్టీవ్‌గా ఉన్న ఆయన తమ్ముడికి మద్ధతుగా నిలుస్తున్నారు.
ఇటీవల గుంటూరులో జరిగిన కార్యకర్తల సమావేశానికి నాగబాబు హాజరయ్యారు. ఆ తర్వాత జరిగిన రెండు పార్టీ సమావేశాల్లోనూ ఆయన ప్రత్యక్షమయ్యారు. కాగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పవన్ విశాఖ స్థానానికి సంబంధించి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే భీమిలి నుంచి పంచకర్ల సందీప్, అమలాపురం నుంచి శెట్టిబత్తుల రాజబాబు, పెద్దాపురం నుంచి తుమ్మల రామస్వామి (బాబు), పోలవరం నుంచి చిర్రి బాలరాజు, అనంతపురం నుంచి టి.సి. వరుణ్  పోటీ చేస్తారని జనసేన వెల్లడించింది.

Related posts