ప్రభాస్ హీరోగా ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో సినిమా చిత్రీకరణకు ముందుకు రావాలి. కానీ నాగ్ అశ్విన్ సినిమాకన్నా ముందుగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆదిపురుష్ సినిమా పట్టాలెక్కనుంది. ప్రభాస్ ఎందుకు తన షెడ్యూల్ మార్చాడు. ఆదిపురుష్ 2022లో విడుదకానుంది. దాని తరవుతే నాగ్ అశ్విన్ సినిమా మొదకానుందా, హీరోయిన్గా దీపికా పదుకొణే, బాలీవుడ్ అగ్ర నటుడు అమితామ్ కీలక పాత్ర అన్నారు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది. అన్న ప్రశ్నలతో పాటు ఇలా అయితే ఈ సినిమా మొదలయ్యే సమయానికి ప్రభాస్, దీపికా పరుకొణే ఎలా ఉంటారో అంటూ కామెంట్లు కూడా వచ్చాయి. అయితే…సంక్రాంతి తర్వాత తమ చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్ ఇస్తానని దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ఏడాది ఆరంభంలో చెప్పారు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ జరిగి పదిరోజులు కావొస్తున్నా.. ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో నెటిజన్లు ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు చేస్తున్నారు. దీంతో స్పందించిన నాగ్అశ్విన్.. “జనవరి 29న కానీ ఫిబ్రవరి 26న కానీ కచ్చితంగా అప్డేట్ ఉంటుంది” అని అన్సార్ ఇచ్చారు. ఈ ట్వీట్తో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
previous post
next post