పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ “ఇస్మార్ట్ శంకర్” అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాని పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. జూలై 18న విడుదల అయిన ఈ చిత్రం అదే క్రేజ్తో ముందుకు సాగింది. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ప్రమోషన్లలో నభా, రామ్ తప్ప మిగతా వారందరూ పాల్గొన్న సంగతి తెలిసిందే. రామ్ విదేశాలకు వెళ్ళంతో ఆ ప్రమోషన్లకు రాకపోయినా ఆ తరువాత యాక్టివ్గానే పాల్గొన్నారు. ఒక్క నభా మాత్రమే ఈ సినిమాకు సంబంధించిన కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయింది కారణం ఏమిటంటే… ఈ సినిమా తరువాత రామ్ గోపాల్ వర్మ బీరు పార్టీ ఇచ్చారట. ఆ పార్టీలో పాల్గొన్న తరువాత నభాకు ఫుల్గా జ్వరమొచ్చిందట. దాంతో సినిమా ప్రమోషన్లలో కానీ, సక్సెస్ మీట్లకు కానీ దూరంగా ఉండిపోయింది. కానీ వీటిల్లో పాల్గొని మరో హీరోయిన్ నిధి అగర్వాల్ మాత్రం బాగానే లాభపడిందట. ఈ చిన్నదాని చేతిలో ప్రస్తుతం రెండు మూడు చిత్రాలు వచ్చి పడ్డాయట. బీరు పార్టీలో పాల్గొనకుండా ఉంటే ‘ఇస్మార్ట్’ నటనకు నభాకు కూడా మరిన్ని అవకాశాలు వచ్చి ఉండేవని అంటున్నారు.