పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వైద్యులపై దాడి చేసిన ముస్లిం నిందితులను వదిలిపెట్టవద్దంటూ కోల్కతాలోని ముస్లింలు మమతకు లేఖ రాశారు.ఎన్ఆర్ఎస్ ఆసుపత్రిలో వైద్యులపై దాడి చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముస్లింలు, మాజీ మిస్ ఇండియా యూనివర్స్, మోడల్ ఉషోషి సేన్గుప్తాలపై దాడి చేసిన ముస్లిం నిందితులను వదిలిపెట్టవద్దంటూ లేఖలో పేర్కొన్నారు.
ఆ మతాన్ని సంతృప్తి పరిచేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నించడం లేదని నిరూపించుకోవాలని లేఖలో కోరారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఇటీవల జరిగిన ఈ రెండు ఘటనలు మమ్మల్ని చాలా బాధించాయి. వైద్యులపైనా, నటి ఉషోషీపైనా జరిగిన దాడి బాధాకరం. ఈ రెండు ఘటనల్లోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు మా మతానికి చెందినవారే. ఈ ఘటనలకు చాలా చింతిస్తున్నాం. నిందితులపై చర్యలు తీసుకోవడం ద్వారా మీ ప్రభుత్వంపై ఉన్న మచ్చను చెరిపేసుకోండని కోల్కతా ముస్లింలు తమ లేఖలో వివరించారు.
జగన్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు: సుజనా చౌదరి