మస్కట్ విమానాశ్రయంలో భార్యను వదిలేసి ఓ భర్త పరారయ్యాడు. చేతిలో డబ్బులు లేక అల్లాడుతున్న బాధితురాలు ఆలియా దీనావస్థను గుర్తించిన అధికారులు ఆమెను హైదరాబాద్కు పంపించారు.హైదరాబాద్ పాతబస్తీలోని సలాలమీకి చెందిన ఆలియా తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెందారు. బంధువులు చేరదీసి మస్కట్కు చెందిన అమీన్ అనే వ్యక్తితో వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు భర్తతో కలిసి మస్కట్లోని ఉమాన్ బీ పట్టణానికి వెళ్లింది. అయితే, ఆ తర్వాత కొన్ని రోజులకే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి.
తాజాగా, హైదరాబాద్ వెళ్దామని ఆమెకు చెప్పిన అమీన్ ఈ నెల 11న రాత్రి మస్కట్ విమానాశ్రయానికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లిన అతడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో గంటలపాటు విమానాశ్రయంలో నిరీక్షించింది. గంటలపాటు అక్కడే నిలబడిన ఆమెను చూసిన అధికారులు విషయం ఆరా తీశారు. పాస్పోర్టు పరిశీలించి ఉచిత పాస్పై జెట్ విమానంలో ఆమెను శంషాబాద్ పంపించారు.