telugu navyamedia
సినిమా వార్తలు

ఎకరం రూ.5 వేలకు కొంటే ఆ తరువాత రూ.50 కోట్లు… దేశంలో అత్యంత్య ధనికుడు ఆయనే : మురళీమోహన్

Murali Mohan Comments Filim Industry

ప్రముఖ సీనియర్ నటుడు, టీడీపీ నేత, వ్యాపారవేత్త మురళీ మోహన్ తన కెరియర్, బిజినెస్ తదితర విషయాలను తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రముఖ టాలీవుడ్ నటుడు శోభన్‌బాబు గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా వివరించారు. శోభన్‌బాబుతో తనకు మంచి సాన్నిహిత్యం ఉండేదని, ఆయనకు ముందు చూపు చాలా ఎక్కువని తెలిపారు. శోభన్‌బాబు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారని, ఎక్కువ శాతం డబ్బును స్థలాలపై వెచ్చించారని, ఎక్కడ నచ్చితే అక్కడ శోభన్‌బాబు ఎకరం రూ.5 వేలకు కొంటే.. ఆ తరువాత ఎకరం రూ. 50 కోట్లకు పెరిగిందని మురళీమోహన్ చెప్పుకొచ్చారు. అలా చెన్నై పరిసర ప్రాంతాల్లో ఎన్నేసి స్థలాలు కొన్నారో లెక్కలేదని, ఒకరకంగా భారతదేశంలోని సినీ ఆర్టిస్టులందరిలోకి శోభన్‌బాబే అత్యంత ధనికుడని చెప్పాలని మురళీమోహన్ తెలిపారు.

Related posts