ప్రముఖ నటుడు, రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ తల్లి శ్రీమతి మాగంటి వసుమతిదేవి గురువారం తమ స్వగృహంలో కన్నుమూశారు. వసుమతిదేవి వయస్సు ప్రస్తుతం 100 సంవత్సరాలు. ఇకపోతే మురళీమోహన్ తల్లి వసుమతీదేవి అంత్యక్రియలు శుక్రవారం ఉదయం జేఎన్ రోడ్ లో నిర్వహించనున్నారు. మురళీమోహన్ ను పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పరామర్శించారు.
ఇటీవలే మురళీమోహన్ తన తల్లి మాగంటి వసుమతీదేవి శతవసంతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృష్ణాజిల్లా గుడివాడలోని గౌరీసంకరపురం గ్రామంలో వేడుకలు నిర్వహించారు. వందో పుట్టినరోజు సందర్భంగా మురళీమోహన్ ఆమెతో కేక్ కట్ చేయించారు . ఈ వేడుకలకు సుమారు 100 మందికిపైగా కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
స్టార్ హీరో వీర్యం డొనేట్… హృతిక్ పై యాంకర్ సంచలన వ్యాఖ్యలు