నల్లా కనెక్షన్లు జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటి పైపులైను నుంచి అక్రమంగా పొందిన వారిపై క్రిమినల్ కేసు నమోదుచేస్తామని ప్రభుత్వం హెచ్చరికలు. గుడిమాల్కాపూర్లోని అమర్నగర్లో ఉండే యాదయ్య తాను భవనం నిర్మించే ఖాళీ ప్రాంతంలో అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా రెండు నల్లా కనెక్షన్లు తీసుకున్నారు.
ఇది గుర్తించిన జలమండలి విజిలెన్స్ అధికారులు జలమండలి ఎండీ ఆదేశాల మేరకు అక్రమ నల్లా కనెక్షన్లు తొలగించడంతో పాటు సంబంధిత ప్లాట్ యజమాని యాదయ్యపై ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అక్రమ నల్లా కనెక్షన్లకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి అధికారులు హెచ్చరించారు.