తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు పోలింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మేయర్లు, ఛైర్పర్సన్ల ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 27న కొత్త పాలక మండళ్ల తొలి సమావేశం జరగనుంది.
తొలి సమావేశంలోనే మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. సభ్యుల ప్రమాణం అనంతరం మధ్యాహ్నం మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఆ వెంటనే డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించిన నోటీసును ఈ నెల 25న జారీ అధికారులు చేయనున్నారు.