telugu navyamedia
Uncategorized

ఎంఐఎంకు మేయర్ స్థానం ఇవ్వం: మంత్రి ప్రశాంత్ రెడ్డి

prashant reddy trs

ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంఐఎంకు మేయర్ స్థానం ఇవ్వమని తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మంత్రి మీడియాతో మాట్లాడారు. మేయర్ సీటు ఇచ్చేందుకు ఎంఐఎంతో టీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకుందంటూ విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.

తమ ప్రభుత్వం అధికారం చేపట్టాక అభివృద్ధి ఊపందుకుందని నిజామాబాద్ లో జరిగిన అభివృద్ధే ఇందుకు నిదర్శనమన్నారు. రోడ్లు, భూగర్భ మురుగు నీటి పారుదల సౌకర్యం, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ, పార్కులు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ కు అశాంతి కావాలంటే ఎంఐఎం, బీజేపీలకు ఓటేయాలన్నారు. 

Related posts