మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీకి అభ్యర్థులే దొరకడం లేదని తెలంగాణ మనత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో మరో ఇరవై ఏళ్లు బీజేపీది ఇదే పరిస్థితి అని అభివర్ణించారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు దక్కని టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థులకు గాలం వేసే పనిలో బీజేపీ ఉందని మంత్రివిమర్శించారు.
మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో సెంటిమెంట్ తో ఆ పార్టీ ఓట్లు సంపాదించుకుందని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఒక్క హామీ అయినా ఇప్పించే సత్తా తెలంగాణ బీజేపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. ప్రజల్లో కుల, మతాల చిచ్చుపెట్టి లాభ పడాలనుకుంటున్న బీజేపీకి ప్రజలు తగినబుద్ధి చెబుతారని అన్నారు.
సచివాలయం కూల్చివేత కోర్టు ధిక్కరణే: ఎమ్మెల్సీ జీవన్రెడ్డి