telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్‌ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు: కేటీఆర్‌

ktr trs

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై ఆ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌నాయకత్వాన్నితెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్నఅభివృద్దికే ప్రజలు మొగ్గుచూపారని, అందుకే మున్సిపల్‌ఎన్నికల్లోభారీ విజయం అందించారని ఆయన అన్నారు.

తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి జరిగిన అన్నిఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ప్రజలుగెలిపిస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణలో జరుగుతున్నఅభివృద్ది, సంక్షేమ పథకాల వల్లనే ఈ విజయంసాధ్యమైందని పేర్కొన్నారు. ఈఎన్నికల ఫలితాలు మున్సిపల్‌ శాఖ మంత్రిగా తనబాధ్యతలను మరింత పెంచాయని కేటీఆర్‌ అన్నారు. వందకు పైగా మున్సిపాలిటీల్లో గెలుపొందడం గొప్ప విషయమని పేర్కొన్నారు.

Related posts