తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించారు. ఇంత ఖరీదైన ఎన్నికలు ఎక్కడా చూడలేదని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ఎన్నికల ప్రక్రియలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు.ఈ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించిందని, 3 మున్సిపాలిటీల్లో సొంతంగా గెలిచామని తెలిపారు.
30 చోట్ల టీఆర్ఎస్ మెజార్టీ సాధించలేకపోయిందన్నారు. ఎన్నికలకు పూర్తి బాధ్యతలు తీసుకున్న మంత్రి కేటీఆర్ ఇలాఖాలోనే 10 మంది స్వతంత్రులు గెలిచారని చెప్పారు. మున్సిపల్శాఖ మంత్రి నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉందంటే.. ఇక రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని లక్ష్మణ్ అన్నారు.