telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : మ్యాచ్ గెలిచి మొదటిస్థానానికి వచ్చిన ముంబై…

ఈ రోజు ఐపీఎల్ 2020 లో చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బౌలింగ్ కు వచ్చిన చెన్నైకి ముంబై బౌలర్లు షాక్ ఇచ్చారు. కేవలం 43 పరుగులకే 7 వికెట్లు చేజార్చుకున్న చెన్నై కనీసం 100 పరుగులైన చేస్తుందా.. అని అనుకున్నారు. కానీ ఆ జట్టు ఆల్ రౌండర్ సామ్ కర్రన్ 47 బంతుల్లో 52 పరుగులు చేయదంతి చెన్నై నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 అరుగులు చేసింది. ఇక 115 పరుగుల లక్ష్యంతో బరిలోకి వచ్చిన ముంబై ఓపెనర్లు క్వింటన్ డి కాక్ (46), ఇషాన్ కిషన్ (68) తో రాణించడంతో ఒక్క వికెట్ పడకుండా ముంబై విజయం సాధించింది. ఈ విజయంతో ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో మొదటి స్థానానికి వెళ్ళింది. ఇక ఈ పరాజయంతో చెన్నై ఐపీఎల్ 2020 లో 8వ ఓటమి నమోదు చేసి ఔంట్ల పట్టికలో చివర్లో నిలవడం మాత్రమే కాకుండా ప్లే ఆఫ్ రేస్ లో ఉన్న చివరి అవకాశాన్ని కూడా చేజార్చుకుంది.

Related posts