జార్జియా రాష్ట్రంలోని డబ్లిన్ ప్రాంతంలో షకేతా మరియన్ మెక్గ్రెగోర్ తన పిల్లలతో నివాసముంటోంది. ఆమె పిల్లలు ఒకరోజు సెల్ఫోన్ కొనిపెట్టమని అడిగారు. మరోరోజు వేరే ఊరు ట్రిప్కు వెళ్దాం అని అడిగారు. దీనికి ఉపాయం ఆలోచించిన మెక్గ్రెగోర్ ఇంట్లోని ఓ గోడపై కొన్ని పేపర్లు అతికించింది. పిల్లలు స్కూలు నుంచి ఇంటికి రాగానే.. వాటిని చూసి షాకయ్యారు. ఆ పేపర్లలో మెక్గ్రెగోర్ ఏం రాసిందంటే.. కిచెన్ మేనేజర్, లీడ్ హౌస్ కీపర్, లాండ్రీ సూపర్వైజర్ ఉద్యోగాలు చేయడానికి ఉద్యోగులు కావాలి. మామ్స్ క్రెడిట్ యూనియన్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటూ నోటీసులు పెట్టింది. పిల్లలతో ఇంట్లో పనులు చేయించి.. దానికి బదులుగా వారు కోరుకున్నవి కొనియ్యాలనే ఐడియా కొత్తగా ఉంది కదూ. ఈ ఫొటోలను తన ఫేస్బుక్ ఖాతాలో మెక్గ్రెగోర్ పోస్ట్ చేయగా.. లక్షలాది మంది నెటిజన్లు ఈ పోస్ట్పై స్పందించారు. పిల్లలకు డబ్బు విలువ తెలిసేలా చేయడానికి ఇది సరైన ఉపాయమంటూ అనేక మంది తల్లులు స్పందించారు.
previous post
ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని చంద్రబాబు పారిపోయారు: మోత్కుపల్లి