telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ సీఎం జగన్‌తో ముఖేష్‌ అంబానీ భేటీ

cm Jagan Ambani

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ ని ఆయన కలిశారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై చర్చించేందుకు జగన్‌తో అంబానీ సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చిస్తున్నట్టు సమాచారం.ముఖేశ్ అంబానీ వెంట యన తనయుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వానీ ఉన్నారు.

Related posts