నేడు టాలీవుడ్లో రెండు కొత్త సినిమాలు పూజా కార్యక్రమాలు జరుపుకున్నాయి. అందులో ఒకటి నాని హీరోగా తెరకెక్కుతున్న టక్ జగదీష్ కాగా, మరో చిత్రం సుశాంత్ నటిస్తున్న ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. సుశాంత్ హీరోగా రూపొందుతున్న ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రాన్ని దర్శకుడు దర్శన్ ఎస్ వినూత్న కాన్సెప్ట్తో రూపొందిస్తున్నారు. దర్శక నిర్మాతలతో పాటు టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో నేడు పూజ కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో స్టార్ కమెడియన్స్ వెన్నెల కిషోర్, ప్రియదర్శి నటిస్తున్నారు. ఏ ఐ స్టూడియోస్, సహస్త్ర మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ప్రవీణ్ లక్కరాజు అందిస్తున్నారు. అల వైకుంఠపురంలో చిత్రంలో కీలక రోల్తో అలరించిన సుశాంత్ సోలోగా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో మంచి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.
previous post