telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కాపు రిజర్వేషన్లపై మోదీతో మాట్లాడాలి.. జగన్‌కు ముద్రగడ లేఖ

ఏపీ సీఎం జగన్ కు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ప్రజల కష్టాల్లో పాలకులు పాలుపంచుకోవాలని హితవు పలికారు. తమ జాతి సమస్య తీర్చాలని తెలిపారు. కాపు రిజర్వేషన్లపై ప్రధాని మోదీతో మాట్లాడాలనిప్రధాని మోదీని జగన్‌ కోరాలన్నారు. హామీలు ఇచ్చిన వాటికి దానాలు చేసి దానకర్ణుడు అని జగన్‌ అనిపించుకుంటున్నారని అన్నారు. అయితే, తమ జాతి చిరకాల కోరికను నెరవేర్చట్లేదని చెప్పారు.

తమకు బీసీ రిజర్వేషన్‌ల విషయంపై 2016లో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాపుల కోరిక సమంజసం అని జగన్ చెప్పారని గుర్తు చేశారు. అసెంబ్లీలో కూడా ఈ విషయంపై జగన్ మద్దతు ఇచ్చారని విన్నానని అన్నారు. ఈ రోజు తమ కోరికను తీర్చడానికి జగన్‌కు ఎందుకు చేతులు రావడం లేదని ప్రశ్నించారు.

ఎన్నికల ముందు ప్రతి రోజు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తమ జాతిని, ఉద్యమాన్ని అణచివేయడానికి పోలీసులతో చేయించిన దమన కాండ, అరాచకాలు, అవమానాలను వైసీపీ తమ ఛానెల్‌లో పదేపదేచూపించి, తమ జాతి సానుభూతి, ఓట్లు పొందిందని చెప్పారు. తమజాతి సమస్య తీర్చమని భారత ప్రధాని గౌరవ మోదీ గారిని కోరాలని జగన్‌ను కోరుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు.

Related posts