telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలు: మీడియాపై ధోనీ భార్య ఫైర్

dhoni wife sakshi

బాధ్యతాయుతమైన జర్నలిజం కనుమరుగైందని మీడియాపై ధోనీ భార్య సాక్షి మండిపడ్డారు. కరోనాపై పోరుకు క్రికెట్ దిగ్గజాలందరూ లక్షల్లో విరాళం ప్రకటిస్తుంటే  టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ కేవలం లక్ష రూపాయలు మాత్రమే ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీ భార్య సాక్షి స్పందించింది. ట్విట్టర్ ద్వారా నిప్పులు చెరిగింది. ఇలాంటి సున్నిత సమయాల్లో వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇంత చెప్పిన సాక్షి.. ధోనీ అసలు విరాళం ఎంత ప్రకటించాడన్న విషయాన్ని మాత్రం చెప్పకపోవడంతో మరోమారు విమర్శలు గుప్పిస్తున్నారు.పూణెలోని ముకుల్ మాధవ్ ఫౌండేషన్‌కు క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్ కెట్టో ద్వారా ధోనీ లక్ష రూపాయల విరాళం అందించాడు. దాదాపు రూ. 800 కోట్ల ఆస్తి కలిగిన ధోనీ కేవలం లక్ష రూపాయలు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సచిన్, గంగూలీ వంటి వారు రూ. 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు.

Related posts