టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్పై ఊహాగానాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ధోనీ రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నాడని, త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెబుతాడంటూ వస్తున్న వార్తలను ధోనీ మేనేజర్ మిహిర్ దివాకర్ ఖండించారు. ధోనీకి ఇప్పట్లో రిటైరయ్యే ఆలోచనలేదని దివాకర్ స్పష్టం చేశారు.
గతేడాది ప్రపంచకప్ నుంచి ఇప్పటి వరకు మహీ ఎలాంటి క్రికెట్ టోర్నీలో పాల్గొనలేదు. ఐపీఎల్-2020 నిర్వహణపై అనిశ్చితి కొనసాగుతుండటంతో ధోనీ క్రికెట్ భవిష్యత్ చర్చనీయాంశంగా మారింది. మహీ వీడ్కోలుపై దివాకర్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికైతే రిటైర్మెంట్పై ధోనీ ఎలాంటి ఆలోచనచేయట్లేదని తెలిపారు. తన ఫామ్హౌజ్లో ఫిట్నెస్ను మెరుగుపరచుకుంటున్నాడన్నారు. కరోనా లాక్డౌన్ ముగిసిన తర్వాత మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభిస్తాడని తెలిపారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష గొంతు నొక్కేస్తున్నారు: చంద్రబాబు