తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎమ్మార్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శలు గుప్పించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు నివాళులర్పించే తీరిక కేసీఆర్ కు లేదని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదని అన్నారు. నిన్న పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చడం దారుణమని అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చడం వెనుక కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. ఈ ఘటన పై సమగ్ర విచారణ జరపాలని మందకృష్ణ డిమాండ్ చేశారు.