telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలని మంద కృష్ణ డిమాండ్

MRPS manda krishna comments Chandrababu

ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కట్టుబడి ఉన్న బీజేపీ ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టాలని మంద కృష్ణ అన్నారు. బిల్లు ప్రవేశపెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలన్నారు.

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ మంత్రివర్గ లో ఎస్సీ లకు స్థానం కల్పించకుండా అవమానించిందని ఆయన మండిపడ్డారు. ఏపీ లో 7 శాతం ఉన్న మాదిగలకు వైసీపీ ప్రభుత్వం 2 మంత్రులు కేటాయించిందన్నారు. తెలంగాణ లో 12 శాతం ఉన్న ఎస్సీ లకు ఒక్కటి కూడా కల్పించక పోవడం హేయమైన చర్య అని మంద కృష్ణ పేర్కొన్నారు.

Related posts