తాజాగా విక్రమ్ కథానాయకుడిగా చీకటి రాజ్యం ఫేమ్ రాజేశ్ ఎం.సెల్వ తెరకెక్కించిన చిత్రం “కదరం కొండన్”. ఈ చిత్రాన్ని తెలుగులో “మిస్టర్ కెకె”గా అనువదిస్తున్నారు. ఈ సినిమా జూలైలో విడుదలవుతుంది. కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కమల్ రెండో కుమార్తె అక్షర హాసన్ హీరోయిన్గా కీలక పాత్రలో నటించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. జూలై 19న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానులలో భారీ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. తాజాగా చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇందులో కొన్ని స్టంట్స్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇక ఇప్పుడు విక్రమ్ మలమాళం, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న పౌరాణిక చిత్రం మహావీర్ కర్ణలో నటిస్తున్నారు. త్వరలో అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.
previous post
చైతూతో గొడవ నిజం కాదు… : చందూ మొండేటి