telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో మరో ఎన్నికల షెడ్యూల్ విడుదల!

After 11 Parishat Elections Telangana

తెలంగాణలో పరిషత్ ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు మే14 లోపు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించింది. అయితే లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాతే ఈ ఓట్ల లెక్కింపు ప్రకియ చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నెల 22 నుంచి మే 14 వరకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది లేదన్న కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి నేపథ్యంలో ఈ నెల 22 నుంచి మే14వ తేదీ వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించింది. స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీల ప్రాతిపదికగానే జరగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 5857 ఎంపీటీసీ స్థానాలు, 535 జడ్పీటీసీ స్థానాలకు గానూ ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు మండల, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవులకు కూడా ఇప్పటికే రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

పోలింగ్ విరాలు:
మొదటి దశ పోలింగ్‌ తేదీ: 06.05.2019

రెండో దశ పోలింగ్‌ తేదీ: 10.05.2019

మూడో దశపోలింగ్‌ తేదీ: 14.05.2019

 

Related posts