తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంపీటీసీ భర్తను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. కోనరావుపేట మండలంలోని పేటకు చెందిన ఎంపీటీసీ శివమ్మ భర్త అశోక్ పనిమీద బయటకు వెళ్లాడు. అలా వెళ్లిన వ్యక్తి రాత్రి అయినా ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
అంతలోగానే గుర్తు తెలియని వ్యక్తులు శివమ్మ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అశోక్ను విడిచిపెట్టాలంటే రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే అతడిని చంపేస్తామని హెచ్చరించడంతో కుటుంబ సభ్యులు వెంటనే కోనరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.