telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కౌంటింగ్ లో గందరగోళం.. చెదలు పట్టిన బ్యాలెట్ పత్రాలు

counting election

తెలంగాణ వ్యాప్తంగా మూడు విడుతలుగా జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అయితే భూపాలపల్లిలో ఎంపీటీసీ బ్యాలెట్ పత్రాలు చెదలు పట్టి పూర్తిగా దెబ్బతినడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మహదేవ్‌పూర్‌ మండలంలోని సూరారం, అంబటిపల్లి గ్రామాలకు చెందిన ఎంపీటీసీ బ్యాలెట్‌ పత్రాలు చెదలుపట్టాయి.

దీంతో కౌంటింగ్ సిబ్బంది గందరగోళంలో పడిపోయింది. ప్రత్యామ్నాయంపై ఎన్నికల సంఘంతో రిటర్నింగ్‌ అధికారులు మాట్లాడుతున్నారు. ఈ స్థానాల కౌంటింగ్ పై ఎన్నికల అధికారులు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

Related posts