దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా…ఎన్కౌంటర్లు, ఉరిశిక్షలు అంటూ ఎన్ని చేసినా… మహిళలపై అఘాయిత్యాలకు బ్రేక్ పడటం లేదు. మహిళలు కనిపించగానే.. రేప్లు చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు దుర్మార్గులు. అయితే.. అలాంటి ఓ దుర్మార్గునికి ఓ యువతి తగిన బుద్ధి చెప్పింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని సీధీ జిల్లా ఉమరియా గ్రామానికి చెందిన ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. అయితే.. తనను తాను కాపాడుకోవడానికి ఏకంగా ఆ దుర్మార్గుడి మర్మాంగాన్నే కోసేసింది. ఈ ఘటన గురువారం రాత్రి 11 గంటలకు చోటుచేసుకుంది. ఈ విషయాన్ని స్థానిక ఎస్సై ధర్మేంద్ర సింగ్ రాజ్పుత్ తెలిపారు. ఆ సమయ్లో తన భర్త పని మీద వేరే ప్రాంతానికి వెళ్లినట్లు మహిళ చెప్పిందని వెల్లడించారు. 13 ఏళ్ల కొడుకు కూడా మహిళతో పాటు ఉన్నాడని చెప్పారు. నిందితుడు ఇంట్లోకి చొరబడగానే.. దొంగలు వచ్చారని భయపడి కొడుకు బయటకు పరుగులు తీశాడని వివరించారు. అదే సమయంలో మహిళను లైంగికంగా దాడి చేసేందుకు నిందితుడు యత్నించాడు. దీంతో అతని మర్మాంగాన్ని మహిళ కోసేసిందని ఎస్సై పేర్కొన్నారు. అయితే.. దీనిపై స్వయంగా ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఆయన తెలిపారు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ధర్మేంద్ర సింగ్ వెల్లడించారు.
previous post